కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అప్పుడే.. వారికే ప్రాధాన్యత..

by Disha Web Desk 14 |
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అప్పుడే.. వారికే ప్రాధాన్యత..
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ భారీగా విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులు, కార్యచరణపై గాంధీభవన్‌లో ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, పీఈసీ సభ్యులు హాజరు అయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసే ఆశావాహుల లిస్ట్ డీసీసీల నుంచి పీసీసీ తీసుకుంది.

ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ పీఈసీ మీటింగ్ తర్వాత.. కొన్ని రోజులకు స్క్రీనింగ్ కమిటీ మిటింగ్ ఉంటుందని, ఫిబ్రవరి మధ్యలో సెంట్రల్ ఎలక్షన్‌లో టికెట్లు ఫైనల్ అవుతాయన్నారు. గెలిచే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టంచేశారు.

Next Story